నగరంలో అమ్మకానికి టౌన్ షిప్‌లు

by  |
నగరంలో అమ్మకానికి టౌన్ షిప్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ద్వారా నిర్మించిన టౌన్ షిప్‌లను అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు మధ్య తరగతి వర్గాల కోసం బండ్లగూడ, పోచారం టౌన్ షిప్‌ల్లో నిర్మించిన ఫ్లాట్లను అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. బండ్లగూడ టౌన్‌షిప్‌లో 2,246, పోచారం టౌన్‌షిప్‌లో 1,470 కలిపి మొత్తం 3,716 ఫ్లాట్‌లను అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. కొనుగోలు దారులకు అందుబాటులోనే ధరలు నిర్ణయించే అవకాశం ఉందని అంంటున్నారు.

Next Story

Most Viewed