చివరి అంకం : రేపు గవర్నర్‌ను కలవనున్న ఈటల..

by  |
చివరి అంకం : రేపు గవర్నర్‌ను కలవనున్న ఈటల..
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఉద్యమ పార్టీతో ఇన్నిరోజులు ఉన్న అనుబంధానికి రేపటితో పూర్తిగా తెరపడనుంది. శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రేపు ఉదయం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ముందుగా గన్‌పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పించిన అనంతరం ఆయన గవర్నర్‌ను కలిసి స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. దీంంతో ఉద్యమ కాలం నాటి నుంచి గులాబీ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇన్నిరోజులు తనకున్న సన్నిహిత్యానికి ఈటల చరమగీతం పాడనున్నట్లు ఆయన వర్గీయులు, సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

Next Story

Most Viewed