భారత్ లో 524 కరోనా కేసులు

by  |
భారత్ లో 524 కరోనా కేసులు
X

న్యూఢిల్లీ: మంగళవారం… ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసుతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, కర్ణాటకలలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 500 మార్క్ ను దాటింది. మంగళవారం మధ్యాహ్నానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 524కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు పదిమంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 101 కేసులు నమోదయ్యాయి. కేరళలో 95 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తెలంగాణలో 36, కర్ణాటకలో 35 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశీయులు 40 మంది ఉన్నారు. అలాగే 36 మంది ఈ వ్యాధి నుంచి బయట పడినట్టు సమాచారం. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 99 కేసులు నమోదవడం గమనార్హం.

Tags: coronavirus, death toll, cases, mount, india, northeast,



Next Story

Most Viewed