- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్: సుతిలి దారాల కోసం కూడా రైతులను సతాయిస్తారా.. ఇదెక్కడి అన్యాయం అంటూ.. పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే విషయంలో అనేక పొరపాట్లు జరుగుతున్నాయని చివరికి గన్నీ బ్యాగులకు కుట్లు వేసేందుకు ఉపయోగించే సుతిలి దారాలను సైతం రైతులే తెచ్చుకోవాల్సి వస్తుందని సభ దృష్టికి తీసుకువచ్చారు.
దీనితో పాటు అనేక సమస్యలను ప్రస్తావించారు. ఎంపీ కల్పించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని చూస్తే మీరు ఇలా చేయడం వల్ల చెడ్డ పేరు వస్తుంది. రైతులకు న్యాయం చేసేలా వ్యవహరించాలని అధికారులకు గట్టిగా చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు సైతం ధాన్యం కొనుగోలు విషయంలో కొంతమంది ధాన్యాన్ని చేరవేసేందుకు రైతులే వాహనాలు తెచ్చుకోవాలని చెబుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని, సంబంధిత అధికారులు ఇటువంటి అంశాలపై దృష్టి సారించాలని లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.