- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ
దిశ, జడ్చర్ల: రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. జడ్చర్లలో 560 డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం, పట్టాల పంపిణీకి జడ్చర్ల పర్యటనకు వస్తుండగా ఏబీవీపీ, బీజేపీ నాయకులు కేటీాఆర్ కాన్వాయ్ ను అడ్డుకొని నిరసన తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వాలని, లబ్ధిదారుల వద్ద లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా జడ్చర్ల పట్టణంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినా కూడా బీజేపీ, ఏబీవీపీ నాయకులు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవడంతో పోలీసులు నివ్వెరపోయారు. సుమారు 16 మంది ఏబీవీపీ, బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు