రేపు ఉదయం 10 గంటలకు మోడీ ప్రసంగం

by  |
రేపు ఉదయం 10 గంటలకు మోడీ ప్రసంగం
X

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్టు పీఎంఓ తెలిపింది. రేపటితోనే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వరకు పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రులను ప్రధానికి వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. ప్రధాని కూడా అందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు ప్రధాని మోడీ ఈ లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించే ప్రకటన చేయనున్నారా? అని చర్చ జరుగుతున్నది.

tags: pm, modi, lockdown, extension, announcement, speech, nation

Next Story

Most Viewed