నేడు 108, 104 అంబులెన్సులు ప్రారంభం : ఆళ్ళ నాని

by  |
నేడు 108, 104 అంబులెన్సులు ప్రారంభం : ఆళ్ళ నాని
X

దిశ ఏపీ బ్యూరో: 108 అంబులెన్స్‌ సర్వీసులు రేపటి నుంచి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య చరిత్రలో నూతనధ్యాయానికి నాంది పలుకుతున్నామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 108 వాహనాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి పేదల ప్రాణాలను హరించారని ఆరోపించారు.

పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రూ.201 కోట్లతో సరికొత్త 108, 104 వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 108, 104 వాహనాలను రేపు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. దీంతో 676 మండలాల్లో నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అర్బన్ పరిధిలో 15 నిమిషాలు, రూరల్ పరిధిలో 20నిమిషాలు, ఏజెన్సీ పరిధిలో 25 నిమిషాల్లో 108 వాహనం చేరుకునేలా టైం మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

మూడు రకాలైన 108 వాహనాలు అందుబాటులోకి తేవడంతో పాటు 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 26 నియోనాటల్ సపోర్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెళ్లడించారు. కరోనాపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యం, వెంటిలేటర్ సౌకర్యాలు పెంచే దిశగా ఆలోచన చేస్తున్నామని అన్నారు. ప్రజలకు సంబంధించి అవగాహన సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం ప్రత్యేకంగా చెప్పారన్నారు.

ప్రతి క్వారంటైన్‌ కేంద్రంలో సౌకర్యాలు పెంచాలని, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్‌పై ప్రత్యేక నిబంధనలు రూపొందించామన్నారు. లాక్‌డౌన్‌లో ప్రజలు సహకరించారు కాబట్టే కేసులు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. కేంద్రం రూపొందించిన కరోనా మార్గదర్శకాలుకు అనుగుణంగా ప్రజలు తమ భాగస్వామ్యం, సహకారం అందించాలని సూచించారు. లాక్‌డౌన్ సడలింపు కారణంగా ఎక్కువ కేసులు పెరగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed