పెళ్లిపై నిఖిల్ క్లారిటీ.. నితిన్ మాటేంటి?

by  |
పెళ్లిపై నిఖిల్ క్లారిటీ.. నితిన్ మాటేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోస్ నిఖిల్, నితిన్ సినీ కెరియర్‌లో తాజాగా హిట్స్ అందుకున్నారు. నిఖిల్ ‘అర్జున్ సురవరం’, నితిన్ ‘భీష్మ’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి. అంతేకాదు ఇద్దరు కూడా తమ తమ స్నేహితురాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకునే క్రమంలో ఉన్నారు. ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన ఇద్దరు… సినిమాలు సూపర్ హిట్ కావడంతో పెళ్లిని డబుల్ హ్యాపినెస్‌తో ఎంజాయ్ చేయాలకున్నారు. కానీ కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. కరోనా ఎఫెక్ట్‌తో నిఖిల్ సాదా సీదా పెళ్లికైనా ఓకే అనుకుంటే… నితిన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట.

నితిన్ ఏప్రిల్ 15న శాలిని రెడ్డిని దుబాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉంటే.. ఏప్రిల్ 16న నిఖిల్ హైదరాబాద్‌లో పల్లవి వర్మతో ఏడడుగులు వేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు వాయిదా పడుతున్న క్రమంలో ఈ ఇద్దరి కథానాయకుల పెళ్లి జరుగుతుందా? లేదా? అనే సందేహం ఇటు తెలుగు ప్రజలు, అటు ఇండస్ట్రీలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే దీనిపై క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. కరోనా కారణంగా మ్యారేజ్‌ను నిలిపేయాలని అనుకోవడం లేదని తెలిపాడు. ఎక్కువ మందిని పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేసుకోకుండా… సన్నిహితుల మధ్య మాత్రమే పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశాడు. ఇలాంటి శుభముహుర్తాన్ని మిస్ చేసే ఛాన్స్ తీసుకోనని క్లారిటీ ఇచ్చాడు.

కానీ పెళ్లి విషయంలో నితిన్ మాత్రం ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదట. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్‌ను చేంజ్ చేసి ఇండియాలోనే ముందుగా నిశ్చయించిన ముహుర్తానికే మ్యారేజ్ చేసుకోవాలా? లేక పెళ్లి తేదిని మార్చాలా? నిర్ణయించ లేక పోతున్నాడట. కాగా త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తామని తెలిపింది నితిన్ సోదరి నిఖితా రెడ్డి.

Tags : Nikhil, Nithin, Arjun Suravaram, Bheeshma, Marraige



Next Story

Most Viewed