ఊహకు అందని ‘రెక్కీ’.. షూటింగ్ కంప్లీట్

by  |
tollywood
X

దిశ, సినిమా: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై కమలకృష్ణ నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కతున్న ఈ చిత్రం ద్వారా అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా కనిపించనున్నాడు. అయితే షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. అలాగే క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్‌లో ఇప్పటివరకు రాని కథాంశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న ‘రెక్కీ’.. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని నిర్మాత కమలకృష్ణ తెలిపారు. ఇక అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు కాగా.. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.



Next Story

Most Viewed