‘ఢిల్లీ క్రైమ్‌’ ఓ మాస్టర్ స్ట్రోక్: మహేశ్‌బాబు

by  |
‘ఢిల్లీ క్రైమ్‌’ ఓ మాస్టర్ స్ట్రోక్: మహేశ్‌బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్‌సిరీస్‌ 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్నది. అంతర్జాతీయ వేదిక మీద భారతీయ వెబ్‌ సిరీస్‌కు దక్కిన అరుదైన గౌరవమని, అందరూ వెబ్‌సిరీస్ టీంను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అవార్డ్ విన్నింగ్‌కు అర్హమేనని, ఆ యూనిట్‌ అందరికీ అభినందనలు తెలిపాడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.

‘ఢిల్లీక్రైమ్ ఓ మాస్టర్ స్ట్రోక్. ఎమ్మి అవార్స్డ్‌లో టెర్రిఫిక్ విన్ సాధించిన ఈ చిత్ర యూనిట్‌కు శుభాభినందనలు. ఈ చిత్రం అవార్డుకు అన్ని విధాల అర్హమే’ అని మహేశ్‌బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో తెలిపారు.

https://twitter.com/urstrulyMahesh/status/1331440900107497472

తాజాగా మ‌హేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరాడు. 60 ల‌క్ష‌ల అభిమానులను సంపాదించుకున్న ఈ సూపర్ స్టార్ ట్విట్టర్​లోను 10.9 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. కెరీర్ విషయానికి వస్తే, మ‌హేశ్ ప్ర‌స్తుతం ‘స‌ర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో మొద‌లు కానుంది. ఇటీవ‌ల మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కాగా, ఈ కార్య‌క్ర‌మానికి న‌మ్ర‌త‌, సితార ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.


Next Story

Most Viewed