డ్రగ్స్‌ కేసు: టాలీవుడ్ హీరోయిన్ పరారీ

by  |
డ్రగ్స్‌ కేసు: టాలీవుడ్ హీరోయిన్ పరారీ
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులకు టాలీవుడ్ హీరోయిన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పట్టుబడ్డ హీరోయిన్ కాస్తా పరారీ అయింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాఫియా‌డాన్‌ కరీంలాలాతో టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు ఏన్సీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఓ హోటల్‌లో దాడులు చేయగా 400 గ్రాముల డ్రగ్స్‌తో హీరోయిన్, మరో ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఇప్పుడు ఆ హీరోయిన్ పరారీ కావడంతో సవాల్‌గా తీసుకున్న అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


Next Story

Most Viewed