టోక్యో ఒలంపిక్స్: సత్తా చాటిన భారత హాకీ జట్టు

by  |
Indian hockey team
X

దిశ, వెబ్‌డెస్క్: ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు సత్తా చాటింది. పోలో-ఏలో అర్జెంటీనాతో తలపడ్డ మ్యాచ్‌లో భారత జట్టు 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. థర్డ్ క్వార్టర్ చివరి వరకు ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా సాధించలేదు. అయితే మ్యాచ్‌లో 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్ వరుణ్‌ తొలి గోల్‌ చేయగా.. అనంతరం అర్జెంటీనా కూడా గోల్‌ సాధించి స్కోర్‌ సమం చేసింది. అయితే 58వ నిమిషంలో ప్రసాద్‌ వివేక్‌సాగర్‌, 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ చేయడంతో 3-1 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది. కాగా, చివరి మ్యాచ్‌లో 1-7 తేడాతో ఆస్టేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు.. బలంగా పుంజుకున్నదనే చెప్పాలి.


Next Story

Most Viewed