కరోనా కల్లోలం.. భారీగా కేసులు నమోదు

by  |
కరోనా కల్లోలం.. భారీగా కేసులు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ పక్క వర్షాలు మరో పక్క కరోనా… ఇలా దేశం మొత్తం అతలాకుతలమైపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 57,891 కేసు నమోదయ్యాయి. 941 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 26 లక్షల 47,663కు చేరింది. ఇందులో 19 లక్షల 19,842 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6 లక్షల 76,900 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు 50,921 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.

Next Story