ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

by  |
corona
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 47,972 సాంపిల్స్‌ను పరీక్షించగా 1,002 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,03,342కు చేరింది. అదే సమయంలో కరోనాతో 12 మంది మరణించగా..తాజా లెక్కల ప్రకారం కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,735కు పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1,508 మంది కరోనా నుంచి కోలుకోగా..మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 19,75,448కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,61,39,934 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


Next Story