రైతు బీమా దరఖాస్తులకు నేడే చివరి రోజు

by  |
రైతు బీమా దరఖాస్తులకు నేడే చివరి రోజు
X

దిశ, ఇబ్రహీంపట్నం: రైతుల విషయమై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కుటుంబాల కోసం ప్రవేశపెట్టిన ఐదు లక్షల రూపాయల రైతుభీమాకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోననివారు, కొత్తగా పాసు బుక్కులు పొందినవారు వెంటనే మండల పరిషత్ కార్యాలయంలోని వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. భూమి పాసుబుక్, ఆధార్, బ్యాంకు పాసుబుక్, నామినీ ఆధార్ జిరాక్సులతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ అన్నదాతలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచించారు.



Next Story

Most Viewed