రికార్డులు తిరగరాస్తోన్న కరోనా.. దేశంలో ఇవాళ ఎన్నికేసులంటే..!

by  |
రికార్డులు తిరగరాస్తోన్న కరోనా.. దేశంలో ఇవాళ ఎన్నికేసులంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి తన రికార్డులను తానే తిరగరాస్తోంది. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,73,810 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 1,619 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా కేసులతో కలిసి దేశంలో ఇప్పటివరకు కొవిడ్ కేసులు 1.50 కోట్లకు చేరుకున్నాయి.

దేశంలో మొత్తంగా 1,50,61,919 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 1,78,760 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 19,29,329 యాక్టివ్ కేసులు ఉండగా, 1,29,53,821 మంది చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదిలాఉండగా, దేశంలో 12.38 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది.

Next Story

Most Viewed