పంజా విసురుతున్న కరోనా.. 25,602 మంది మృతి

by  |
పంజా విసురుతున్న కరోనా.. 25,602 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదయ్యాయి. 687 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 10 లక్షల 3 వేల 832 కు చేరుకుంది. ఇందులో 6 లక్షల 35, 756 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 42,473 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 25,602 కు చేరుకుంది.

Next Story

Most Viewed