భారత్‌లో 11 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
భారత్‌లో 11 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో రోజురోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి రోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40,425 కొత్త కేసులు నమోదయ్యాయి. 681 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 11,18,043 కు చేరుకుంది. ఇందులో 7 లక్షల 87 మంది బాధితులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 90 వేల 459 మంది బాధితులు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 27,497 కు చేరుకుంది.

Next Story