వామ్మో.. కేవలం 24 గంటల్లో అన్ని కేసులా..?

by  |
వామ్మో.. కేవలం 24 గంటల్లో అన్ని కేసులా..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో గత కొద్ది రోజుల నుంచి వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్ లో 37, 724 కొత్త కేసులు నమోదయ్యాయి. 648 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 11 లక్షల 92,915 కు చేరుకుంది. ఇందులో 7 లక్షల 53,049 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4 లక్షల 11,133 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 28,732 కు చేరుకుంది.

Next Story

Most Viewed