ఏపీలో కరోనా కల్లోలం

by  |
ఏపీలో కరోనా కల్లోలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు వైరస్‌కు బలవుతున్నారు. మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. ఏకంగా 9,024 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో 87 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2, 203కి చేరింది. తాజా కేసులతో మొత్తంగా 2,44,549 కేసులు రికార్డు అయ్యాయి. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 1,54,749 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 87,597 యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25,92,619 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

తూర్పుగోదావరి జిల్లా 1372
కర్నూలు 1138
పశ్చిమ గోదావరి 678
విశాఖపట్నం 676
గుంటూరు 717
అనంతపురం 959
చిత్తూరు 758
కడప 579
నెల్లూరు 364
శ్రీకాకుళం 504
కృష్ణా 342
ప్రకాశం 343
విజయనగరం జిల్లాలో 594 కరోనా కేసులు నమోదైనట్టు హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed