తెలంగాణలో 42 వేలు దాటిన కేసులు

by  |
తెలంగాణలో 42 వేలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. రోజుకి వెయ్యికి పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ రాష్ట్రంలో 1,478 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,496కు చేరింది. ఈ రోజు ఒక్కరోజే 1,410 మంది బాధితులు డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకొని 28,705 మంది డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మరణాలు 403కు చేరాయి. ప్రస్తుతం 13,389తో యాక్టివ్ కేసులు ఉన్నట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది. ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 806 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

Next Story

Most Viewed