ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలి

by  |
ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: బుధవారం కురిసిన వర్షం కారణంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రి జలమయమైందని, దీంతో చికిత్స పొందుతున్న రోగులకు, సిబ్బందికి ఇబ్బందులు తలెత్తాయని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీఓ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ ప్రభుత్వానికి విన్నవించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కూడా ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.

Next Story

Most Viewed