- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తమను త్వరలో చర్చలకు పిలువనుందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ అమలు, కరువు భత్యం విడుదల, హెల్త్ కార్డుల అమలు, సీపీఎస్ రద్ధు వంటి విషయాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా కోవిడ్ కారణంగా హోం క్వారంటైన్ పీరియడ్ 14 రోజులను ఆన్ డ్యూటీగా పరిగణించాలని, కొత్త జిల్లాల్లో ఉద్యోగులకు 20 శాతం ఇంటి అద్దె అలవెన్స్ వంటివి ప్రధానంగా ప్రభుత్వం అమలు చేయవలసి ఉందన్నారు. ఆయా సమస్యలను త్వరలో ప్రభుత్వంతో జరిపే చర్చలలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Next Story