మూడో సారి సేమ్ సీన్…

by  |
మూడో సారి సేమ్ సీన్…
X

కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. మొదట మార్చి9న మ్యానిఫెస్టో విడుదల ఉంటుందని పార్టీ ప్రకటించింది. కానీ అనుకున్న విధంగా జరగలేదు. ఆ తర్వాత మార్చి 11న కూడా మళ్లీ అదేరకం ప్రకటన చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల కార్యక్రమం రద్దు అయింది. తాజాగా ఆదివారం సాయంత్రం సీఎం మమతా బెనర్జీ మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తారని పార్టీ శ్రేణులు ప్రకటించాయి. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశాయి.ఇంతలో ఏం జరిగిందో్ తెలియదు కానీ కార్యక్రమాన్ని మూడో సారి కూడా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు పార్టీ శ్రేణులు తెలిపాయి. కాగా కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి గల కారణాలను ఆ పార్టీ వర్గాలు వెల్లడించలేదు.

Next Story

Most Viewed