సీపీఐ నారాయణ కాలు పట్టుకున్న వైసీపీ ఎంపీ.. ప్రశంసించిన అభిమానులు

by  |
CPI Narayana
X

దిశ, డైనమిక్ బ్యూరో : అకాల వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రాయల చెరువును పరిశీలించేందుకు వెళ్లిన సీపీఐ నారాయణ గాయపడ్డారు. ఆయన కాలుకు గాయం కావడంతో నడిచేందుకు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెంటనే నారాయణ వద్దకు చేరుకున్నారు. వృత్తిరీత్యా గురుమూర్తి వైద్యుడు కావడంతో నారాయణకు ప్రథమ చికిత్స చేశారు. ఆయన కాలును తన తొడపై పెట్టుకుని మరీ వైద్యం చేశారు. ఆ దృశ్యాన్ని చూసిన వైసీపీ, సీపీఐ నాయకులు ఎంపీ గురుమూర్తిని ప్రశంసించారు. ప్రస్తుతం గురుమూర్తి చికిత్స చేస్తున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed