శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.31 కోట్లు

by  |
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.31 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న శ్రీవారిని 35, 265మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 15, 451 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed