పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

by Sridhar Babu |
పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
X

దిశ, కరకగూడెం: మండలంలోని రఘునాథపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది. గురువారం అటవీ ప్రాంతానికి వెళ్లిన పశువుల కాపలా దారులు పశువులను కాస్తుండగా.. ఆకస్మికంగా పశువులు బెదరడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చేరుకుని పెద్దపులి అడుగులను అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజలందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ఎవ్వరూ కూడా అడవికి వెళ్లవద్దని సూచించారు.



Next Story

Most Viewed