- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
by Sridhar Babu |

X
దిశ, కరకగూడెం: మండలంలోని రఘునాథపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది. గురువారం అటవీ ప్రాంతానికి వెళ్లిన పశువుల కాపలా దారులు పశువులను కాస్తుండగా.. ఆకస్మికంగా పశువులు బెదరడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చేరుకుని పెద్దపులి అడుగులను అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజలందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ఎవ్వరూ కూడా అడవికి వెళ్లవద్దని సూచించారు.
- Tags
- forest
Next Story