వామ్మో పులి.. భయంతో పరుగులు తీసిన రైతు

by  |
వామ్మో పులి.. భయంతో పరుగులు తీసిన రైతు
X

దిశ, వేములవాడ: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతు పక్కనే ఉన్న పులిని చూసి పరుగులు పెట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుని వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చంద్రయ్య గ్రామ శివారున గల పుట్టల మలన్న వద్ద తన పొలానికి నీళ్లు పెట్టేందుకు గురువారం రాత్రి వేళ వేళ్లాడు. పొలం పక్కన ఉన్న ఒర్రెలో పులిని చూసిన చంద్రయ్య వామ్మో పులి.. చస్తిరా అని అరుచుకుంటూ ఊళ్లోకి వచ్చాడు. గత కొంత కాలంగా మండలంలో చిరుత పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. పొలాల వద్దకు వెళ్లెందుకు రైతులు జంకుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ ఆఫీసర్లు స్పందించి త్వరగా చిరుత పులిని పట్టుకొని అడవి ప్రాంతాల్లో వదిలి వేయాలని మండల ప్రజలకు కోరుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story