నల్లమల అడవిలో పెద్దపులి మృతి..

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-11-12 05:15:53  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో చలమ రేంజ్ అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ శాఖ అధికారులు స్వాధీనం [&hellip;]</p>

నల్లమల అడవిలో పెద్దపులి మృతి..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో చలమ రేంజ్ అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Next Story