పోలీసులే టార్గెట్.. ఆ అడవుల్లో టిఫిన్ బాంబులు

by  |
పోలీసులే టార్గెట్.. ఆ అడవుల్లో టిఫిన్ బాంబులు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొప్పుసురు అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్సులు ల‌భ్యమ‌య్యాయి. మావోయిస్టుల క‌ద‌లిక‌లున్నాయ‌న్న నేప‌థ్యంలో కొద్దిరోజులుగా పోలీసులు, ప్రత్యేక బ‌ల‌గాలు వాజేడు అడ‌వుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే భాగంగా కొప్పుసురు అట‌వీప్రాంతంలో త‌నిఖీలు నిర్వహిస్తుండ‌గా మావోయిస్టులు అమర్చిన నాలుగు టిఫిన్ బాంబులను కనుగొన్నారు. కూంబింగ్‌కు వ‌చ్చే ప్రత్యేక బృందాల‌ను టార్గెట్ చేస్తూ ఈ టిఫిన్ బాంబుల‌ను అమ‌ర్చార‌ని పోలీసులు తెలిపారు. నాలుగు లేదా 5 సంవత్సరాల క్రితం అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Next Story