జపాన్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం

by  |
జపాన్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
X

దిశ, వెబ్‌డెస్క్ : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశంలోని ఈశాన్య ప్రాంతమైన మియాగి తీరంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 శాతం ఉందని అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనల దాటికి 1మీటరు మేర సునామీ వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది.

2011లో సునామీ ప్రభావం చూపించిన ప్రాంతంలోనే భూకంపం వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సముద్రంలో సుమారు 60కిలో మీటర్ల లోతులో 30 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. దీంతో జపాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లో నివాసముండే ప్రజలను వెంటనే వేరే చోటుకు తరలిస్తున్నారు.



Next Story

Most Viewed