చంద్రబాబు వాహనంపై రాళ్లు రువ్విన దుండగులు…

by  |
Chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసింది. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ రోజు తిరుపతిలో టిడిపి బహిరంగ సభ నిర్వహించగా, అక్కడికి చేరుకున్న చంద్రబాబు వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు టిడిపి నేతలకు గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఒకరు మహిళ ఉండడం గమనార్హం. చంద్రబాబు ఈ దాడిని నిరసిస్తూ.. వాహనం దిగి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అంతేకాకుండా జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న తనకే రక్షణ లేకుంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాళ్లతో దాడికి పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed