- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: మణికొండలో వక్ఫ్బోర్డ్ చైర్మన్ సలీం పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన ఘటన ఫిలింనగర్లో సంచలనం రేపుతోంది. షార్ట్ ఫిలిం డైరెక్టర్ను బెదిరించి రూ. 50 వేలు వసూలు చేయడమే కాకుండా.. షూటింగ్ అనుమతుల కోసం మొత్తం రూ. 4 లక్షలు డిమాండ్ చేసింది ఓ ముఠా. బాధిత డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ పరిసర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున షూటింగ్ చేస్తుండగా.. వక్ఫ్ బోర్డు ప్రెస్ రిపోర్టర్ల మంటూ 8 మంది వచ్చారు. షూటింగ్కు అనుమతి ఏది అంటూ ప్రశ్నించగా.. లోకల్ పోలీసుల అనుమతి తీసుకున్నట్టు పత్రాలు చూపించాము. అయినప్పటికీ వాళ్లు వినకుండా.. వక్ఫ్బోర్డ్ చైర్మన్ సలీం పేరు చెప్పి రూ. 50 వేలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. షూటింగ్ అనుమతి కోసం రూ. 4 లక్షలు డిమాండ్ చేశారని.. చివరకు రూ. లక్ష ఇవ్వమంటే.. షార్ట్ ఫిలిం అని చెప్పడంతో రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని సదరు డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.