ఆ ముగ్గురిని మింగిన సిమెంట్ మిక్సింగ్ లారీ

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మైలార్‌దేవ్‌పల్లి వద్ద ఈ ఘటన చేసుకుంది. ఖమరుద్దీన్, జమీల్, బబ్లూ మోటర్ సైకిల్‌పై చాంద్రాయణగుట్ట నుంచి దుర్గానగర్ వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన సిమెంట్ రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటన [&hellip;]</p>

Road Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మైలార్‌దేవ్‌పల్లి వద్ద ఈ ఘటన చేసుకుంది. ఖమరుద్దీన్, జమీల్, బబ్లూ మోటర్ సైకిల్‌పై చాంద్రాయణగుట్ట నుంచి దుర్గానగర్ వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన సిమెంట్ రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని సైబరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకట్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ పరిశీలించారు. కాగా, మృతులు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story