నెల రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-24 23:38:16  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం జరిగింది. ఒకే కుటుంబంలో మగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సుగాలిమిట్ట సర్పంచ్‌గా ఉన్న బీమా నాయక్‌కు ఇద్దరు కుమారులు. ఇటీవలే చిన్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో, తమ్ముడి మరణాన్ని జీర్చించుకోలేక బీమా నాయక్ పెద్ద కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు చనిపోయారనే బాధతో బీమా నాయక్ సైతం సూసైడ్ చేసుకున్నాడు. నెలరోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద [&hellip;]</p>

నెల రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం జరిగింది. ఒకే కుటుంబంలో మగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సుగాలిమిట్ట సర్పంచ్‌గా ఉన్న బీమా నాయక్‌కు ఇద్దరు కుమారులు. ఇటీవలే చిన్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో, తమ్ముడి మరణాన్ని జీర్చించుకోలేక బీమా నాయక్ పెద్ద కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు చనిపోయారనే బాధతో బీమా నాయక్ సైతం సూసైడ్ చేసుకున్నాడు. నెలరోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story