పులిగుండాల ప్రాజెక్టులో ముగ్గురు గల్లంతు

by  |
పులిగుండాల ప్రాజెక్టులో ముగ్గురు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో కలిసి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని కల్లూరు మండలం బత్తులపల్లికి చెందిన గుణ, చలపతి, సాయిగా గుర్తించారు. ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.

Next Story

Most Viewed