యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరప్రమాదం

by  |
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం భువనగిరి- హైదరాబాద్‌ హైవేపై ఆగివున్న నీళ్ల ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed