Breaking: ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

by  |
Road accident
X

దిశ, హాలియా: నల్లగొండ జిల్లా హాలియా పట్టణ సమీపంలోని ఇబ్రహీంపేట బ్రిడ్జి వద్ద ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తోన్న కండక్టర్ సహా ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన స్థానిక ఎస్ఐ శివ కుమార్ సిబ్బందిని హుటాహుటిన ఘటనా స్థలానికి పంపించారు. కాగా, అప్పటికే అక్కడ ఉన్న కొందరు యువకులు అంబులెన్సుకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పట్టించుకోకుండా యువకులతో దురుసుగా మాట్లాడి గొడవకు దిగారు. ‘‘క్షతగాత్రులను హాలియాకు తీసుకెళతాం. వస్తే అక్కడికి రండి, లేదంటే మీరు సొంతంగా వాహనం మాట్లాడుకొని మిర్యాలగూడకు తీసుకెళ్లండి.’’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడి అక్కడినుండి వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. కాగా, గాయాలతో ఇబ్బంది పడుతోన్న వారిని వదిలేసి అంబులెన్సు సిబ్బంది వెనుదిరగడంపై స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.


Next Story

Most Viewed