- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హాలియా: నల్లగొండ జిల్లా హాలియా పట్టణ సమీపంలోని ఇబ్రహీంపేట బ్రిడ్జి వద్ద ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తోన్న కండక్టర్ సహా ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన స్థానిక ఎస్ఐ శివ కుమార్ సిబ్బందిని హుటాహుటిన ఘటనా స్థలానికి పంపించారు. కాగా, అప్పటికే అక్కడ ఉన్న కొందరు యువకులు అంబులెన్సుకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పట్టించుకోకుండా యువకులతో దురుసుగా మాట్లాడి గొడవకు దిగారు. ‘‘క్షతగాత్రులను హాలియాకు తీసుకెళతాం. వస్తే అక్కడికి రండి, లేదంటే మీరు సొంతంగా వాహనం మాట్లాడుకొని మిర్యాలగూడకు తీసుకెళ్లండి.’’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడి అక్కడినుండి వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. కాగా, గాయాలతో ఇబ్బంది పడుతోన్న వారిని వదిలేసి అంబులెన్సు సిబ్బంది వెనుదిరగడంపై స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
- Tags
- Halia