బ్లాక్ ఫంగస్ కలకలం.. రుయా ఆస్పత్రిలో ఇద్దరు మృతి

by  |
black fungus
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దీని కేసులు ఎక్కువ కావడమే కాకుండా, మరణాలసంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా.. చిత్తూరు జిల్లా రుయా ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్‌తో ఇద్దరు మృతిచెందారు. మృతులు నిమ్మనపల్లె, కుప్పంకు చెందిన వారిగా వైద్యులు గుర్తించారు. కాగా, మరో ఐదుగురి బ్లాక్ ఫంగస్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా వుండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్‌తో మరో వ్యక్తి మృతిచెందారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. దీంతో బ్లాక్ ఫంగస్ మరణాలు జిల్లాలో రెండుకు చేరాయి.

Next Story

Most Viewed