- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కనికి ప్రాంతంలో ఎడ్లబండిపై పిడుగు పడి ముగ్గురు రైతులు మృతిచెందారు. వివరాల ప్రకారం.. కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన పద్మ(40), డోంగ్రి శ్వేత (18), బొర్కోట్ పున్నయ్య.. కనికి శివారు పత్తి చేనులో ఎరువులు వేసేందుకు వెళ్లారు. చేను నుంచి తిరిగి వస్తున్నప్పుడు భారీ వర్షం కురిసింది.
ఈ క్రమంలోనే ఎడ్లబండిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. డోంగ్రి పద్మ, శ్వేత.. తల్లి, కూతుర్లు కాగా.. పున్నయ్య వేరే కుటుంబానికి చెందిన వ్యక్తి. పిడుగుపాటుతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన ముగ్గురితో పాటు ఒక ఎద్దు కూడా చనిపోయింది. ఘటన స్థలానికి కౌటాల ఎంపీపీ విశ్వనాథ్, తహసీల్దార్ మున్వర్ షరీఫ్, ఎస్ఐ ఆంజనేయులు చేరుకొని వివరాలు సేకరించారు.
Next Story