లిక్కర్ లేక.. పెయింట్, వార్నిష్ తాగి ముగ్గురు మృతి

by  |
లిక్కర్ లేక.. పెయింట్, వార్నిష్ తాగి ముగ్గురు మృతి
X

చెన్నై: లాక్ డౌన్ తో లిక్కర్ దొరక్క మందుబాబులు బేజారు అవుతున్నారు. ఏది పడితే అది తాగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తమిళనాడులో లిక్కర్ దొరక్కపోవడంతో ముగ్గురు వ్యక్తులు పెయింట్.. వార్నిష్ కలుపుకొని తాగి ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడు చెంగల్పట్టుకు చెందిన ముగ్గురు వ్యక్తులు శివ శంకర్, ప్రదీప్, శివరామన్ లు మందు దొరక్క ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు పెయింట్, వార్నిష్ కలిపి సేవించారు. అనంతరం వారికి ఎడతెరిపి లేకుండా వాంతులయ్యాయి. దీంతో వారిని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఒకరి వెనుక ఒకరు ఆస్పత్రిలో మరణించారు.

Tags: Coronavirus, tamil nadu, paint, varnish, consumed, liquor


Next Story

Most Viewed