వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా.. ముగ్గురు మృతి

by  |
వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో వలస కూలీలు మరోసారి వారి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో వలసకూలీల బస్సు ప్రమాదానికి గురైంది.

మధ్యప్రదేశ్​ గ్వాలియర్ ​జిల్లాలోని జోరాసిలో వద్ద వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ నుంచి ఛతర్‌పుర్, టికమ్‌గఢ్​ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


Next Story

Most Viewed