తల్లిదండ్రులు లేని యువతిని లాడ్జికి తీసుకెళ్లి.. ఒకరి తర్వాత మరొకరు..!

by  |
rape-in-tirupathi
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు లేని 19 ఏళ్ల యువతిని లాడ్జికి తీసుకెళ్లి నాగేంద్రబాబు అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ ఘటన తిరుపతిలోని మంగళం ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం వెలుగుచూసింది.

అయితే, తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని స్వయంగా బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే, ఆ యువతితో చాలాకాలంగా నాగేంద్రబాబుకు సంబంధం ఉందని తెలుస్తోంది. మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed