విషగుళికలు మింగి.. కుటుంబం ఆత్మహత్య

by  |
suicide
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. విషగుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు రామకృష్ణ(45), రాజేశ్వరీ(35), దేవేంద్ర(14)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed