పిల్లలతో సహా తల్లి మిస్సింగ్..

by  |
పిల్లలతో సహా తల్లి మిస్సింగ్..
X

దిశ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో పిల్లలతో సహా తల్లి మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంట సమయంలో కనిపించకుండా పోయింది. ఎస్సై సాయిరెడ్డి కథనం ప్రకారం.. నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంత నగదు, బట్టలు తీసుకుని తొర్లికొండ గ్రామానికి చెందిన గంగాధర్ భార్య శ్రీలత(39) కుమార్తె సుప్రజ(22) కుమారుడు మణికంఠ (12)తో సహా కనిపించకుండా పోయినట్లు ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.

శ్రీ లత భర్త గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించినట్లు, బంధువుల ఇళ్లలో కూడా వెతకమని గంగాధర్‌కు సూచించినట్లు తెలిపారు.


Next Story

Most Viewed