కాలువలో జారిపడి ముగ్గురు మృతి

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రమాదవశాత్తు కాలువలో కాలుజారి పడి ముగ్గురు చనిపోయారు. మృ‌తులు సావిత్రి (60) అభిషేక్, (7)జాన్ (7)గా గుర్తించారు. మృతదేహాలను బయటకు తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒకేసారి గ్రామంలో ముగ్గురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Next Story