చెన్నైలో విషవాయువు లీక్.. ముగ్గురు మృతి

by  |
చెన్నైలో విషవాయువు లీక్.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నై కాంచీపురం పెరంబదూర్‌లో దారుణం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకయి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed