కీసరలో ఇద్దరు మహిళలతోపాటు ఓ వ్యక్తి మృతి

by  |
Road-Accidents1
X

దిశ, కీసర: కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ కు చెందిన కె.బాలకృష్ణ (48) కుటుంబ సభ్యులతో కలసి ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకకు హాజరై కారులో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తిరిగి వస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున కీసర మండలం యద్గారపల్లికి రాగానే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలకృష్ణ భార్య రేణుక (42), వారి బంధువు శంకరమ్మ (48) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన బాలకృష్ణతోపాటు అతని కుమారుడు భాస్కర్ (20) లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా బాలకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని కీసర సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు.



Next Story

Most Viewed