రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

by  |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఈ విషాద ఘటన కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. కొత్తపల్లి ప్రధాన రోడ్డుపై ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు కొత్తపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed