- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అబ్దుల్లాపూర్మెట్: మరో 15 నిమిషాల్లో వారు ఇంటికే చేరేవారు.. అంతలోనే వారిని మృత్యువు కబలించింది. ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో ముగ్గరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధి పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఓ డ్రైవర్ లారీని నిలిపిఉంచాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ఎర్టిగా కారు ఢీకొట్టగా.. కారు డ్రైవర్ సహా తండ్రికొడుకులు మృత్యువాత పడ్డారు. ఏపీ రాష్ట్రం అమరావతి నుంచి మెదక్ వెళ్తున్న లారీ.. ఓఆర్ఆర్ పైకి ఎలా వెళ్లాలో తెలియక రోడ్డుపక్కన ఆపి డ్రైవర్ స్థానికులను అడిగే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ క్రమంలో బాపట్ల నుంచి హైదరాబాద్ వస్తున్న ఎర్టిగా కారు అతివేగంగా వచ్చి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న సరూర్నగర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన ఉపేంద్రనాథ్, అతని కుమారుడు ప్రభాకర్, కారు డ్రైవర్ రోహిత్ అక్కడిక్కడే చనిపోయారు. లారీ వెనుకభాగంలో కారు ఇరుక్కపోవడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. స్థానికుల సాయంతో మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.